ఒకటో తరగతికి ముందే విద్యార్థుల పునాదిని స్థాపించడానికి ఒక సంవత్సరం పాటు 'ప్రిపరేటరీ క్లాస్'ను ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ నూతన విద్యావిధానాన్ని ఏపీలో 2021–22 నుండి రాష్ట్రంలో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. 5 + 3 + 3 + 4 పాఠశాల వ్యవస్థను కొత్తగా అమలు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి తగిన విధంగా పాఠ్య పుస్తకాలు ముద్రించడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు రూపొందించాల్సి ఉంటుంది. పిపి -1, పిపి -2 అందిస్తున్న అంగన్వాడీలను వైఎస్ఆర్ ప్రీ-ప్రైమరీ పాఠశాలలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది.ప్రస్తుతం అమలు చేయనున్న ప్రీ ఫస్ట్ క్లాస్ దీని తర్వాత ఉండనుంది. దీని వల్ల పిల్లలు సరదాగా నేర్చుకోగలరు. జాతీయ నూతన విద్యా విధానంపై చర్చ రాకముందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యావిధానంలో సంస్కరణలను అమలు చేస్తోందని, వీటిలో అంగన్వాడీలను ప్రీ-ప్రైమరీ పాఠశాలలుగా మార్చడం కూడా ఉందని ఈ నూతన విద్యావిధానంపై విద్యాశాఖ మంద్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం మా దృష్టి ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడంపై ఉందని ఆయన అన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa