సన్నిహితుల కోసం ట్యాబ్లెట్లు తీసుకెళ్లిన పాపానికి ఓ వ్యక్తి అన్యాయంగా ఐదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. అంతేకాక, కొరడా దెబ్బలు కూడా తిన్నాడు. స్నేహితుడి కోరిక మేరకు అతను ఇక్కడి నుంచి మరో దేశానికి ఆ ట్యాబ్లెట్లను తీసుకెళ్లాడు. అక్కడే జైలు శిక్ష అనుభవించాడు. చివరికి ఇటీవలే స్వదేశానికి చేరుకున్నాడు. అయితే, ఆ ట్యాబ్లెట్లు తెమ్మన్న హైదరాబాద్కు చెందిన దంపతులతో పాటు మరో యువకుడికి కూడా జైలు శిక్ష, కొరడా దెబ్బలు తప్పలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు.. హైదరాబాద్లోని లంగర్హౌజ్కు చెందిన అబ్దుల్ వహీద్ (37) రియాద్లోని ఒక బ్యాంకులో పని చేస్తున్నాడు. 2015లో ఇతనికి కూతురు పుట్టింది. దీంతో చూసేందుకు అప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చాడు. వచ్చే సమయంలో రియాద్లో పనిచేస్తున్న హైదరాబాద్కు చెందిన మోయిజ్ తన స్నేహితులు ఇచ్చిన పార్సిల్ తీసుకురావాలని వహీద్ను కోరాడు. అతనికి సాయం చేసినట్లవుతుందని ఆ ట్యాబ్లెట్ల పెట్టెతోనే వహీద్ విమానం ఎక్కి రియాద్లో దిగాడు.విమానం దిగిన వెంటనే కస్టమ్స్ అధికారులు వహీద్ను తనిఖీ చేశారు. ఆ పార్శిల్లో ట్యాబ్లెట్ల డబ్బా ఉంది. అయితే, వాటితో చిక్కేంటంటే ఆ ఔషధాన్ని సౌదీలో పూర్తిగా నిషేధించారు. దీంతో వహీద్ను పోలీసులు అరెస్టు చేశారు. వహీద్ జరిగినదంతా చెప్పగా సౌదీ పోలీసులు బదర్ను కూడా అరెస్టు చేశారు. తన భార్య హజ్రాకు అనారోగ్యం, నిద్రలేమి సమస్య ఉందని, సౌదీలో మందుల ఖరీదు ఎక్కువగా ఉండటంతో.. హైదరాబాద్ నుంచి తెప్పించానని బదర్ వివరణ ఇచ్చుకున్నాడు. కానీ, బదర్ భార్య గతంలో ఈ మందులను వాడలేదని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసు కోర్టుకు వెళ్లింది. విచారణ జరిపిన న్యాయస్థానం నలుగురినీ దోషులుగా తేల్చి శిక్ష వేసింది. వహీద్కు 8 సంవత్సరాల జైలు శిక్ష, 800 కొరడా దెబ్బలు, లక్ష రియాళ్ల (రూ.20 లక్షలు) జరిమానా, మందు బిళ్లలను తెప్పించిన బదర్, హజ్రాకు 5 సంవత్సరాల జైలు శిక్ష, 500 కొరడా దెబ్బలు, లక్ష రియాళ్ల జరిమానా, మోయిజ్కు రెండున్నరేళ్ల జైలు, 300 కొరడా దెబ్బలు విధించాలని కోర్టు తీర్పిచ్చింది. ఇటీవల సౌదీ అరేబియా రాజు సల్మాన్ మానవతా దృక్పథంతో క్షమాభిక్ష ప్రకటించగా.. అబ్దుల్ వహీద్ శిక్ష గడువుకు ముందే విడుదల అయి స్వదేశానికి చేరుకున్నాడు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa