భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న పుట్టెడు దు:ఖంతో భార్య బాధపడుతుంది. ఇంతలో మృతుడి బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆత్మహత్యకు ఆమె కారణమంటూ స్తంభానికి కట్టేసి చావ బాదారు. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొత్తగూడెం శ్రీనగర్ కాలనీలో ఆటోడ్రైవర్ రాజశేఖర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతిపై అతని కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు పిర్యాదు చేశారు. మృతుడి ఒంటి పై గాయాలున్నట్లు బంధువులు ఆరోపించారు.దీంతో రాజశేఖర్ చావుకు అతని భార్య కారణం అయి ఉంటుందని భావించి ఆమెను ఇంటి ముందు స్థంబానికి కట్టేసి మూకుమ్మడిగా దాడి చేశారు. హత్య ఎందుకు చేశావంటూ నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రీక్త పరిస్థితి నెలకొంది. రాజశేఖర్ ఆత్మహత్య చేసుకునే పరిస్తితి లేదని అతని భార్యను విచారిస్తే వాస్తవాలు భయటకు వస్తాయని బంధువులు ఆరోపిస్తున్నారు. రాజశేఖర్ ఆత్మహత్యకు భార్య ఎంత వరకు కారణం అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది కానీ ఆమెను స్తంభానికి కట్టేసి దాడి చేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa