ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నతల్లిని కత్తితో పొడిచి..ఆస్తి కోసం కొడుకు ఘాతుకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 12, 2020, 06:13 PM

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో కన్నతల్లిని కర్కశంగా నరికి చంపాడో కసాయి కొడుకు. నిద్రపోతున్న తల్లిపై అమాంతం కత్తితో విరుచుకుపడ్డాడు. కన్నతల్లిని పొట్టనబెట్టుకున్నాడు. ఈ అత్యంత అమానవీయ ఘటన రొంపిచర్ల మండలం అన్నవరంలో జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు..అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న తల్లిపై కొడుకు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆస్తి వివాదాల కారణంగానే ఈ దారుణం జరిగినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa