ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో అక్టోబర్ 5 నుంచి స్కూళ్లు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 11, 2020, 02:21 PM

ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో తాత్కాలికంగా మూసివేయబడ్డ ప్రభుత్వ పాఠశాలలను తెరిచేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాలలను ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. అక్టోబర్ 5 నుండి స్కూల్స్ ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు.ఉన్నతాధికారుల సూచనల మేరకు అన్‌లాక్ 5 మార్గదర్శకాలు వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థులకు అందించే విద్యా కానుకను ఇప్పటికే సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. కరోనా తరవాత కాలేజీలు, పాఠశాలలు, యూనివర్సిటీల్లో అనేక మార్పులు చోటు చేసుకోనున్నట్లు చెప్పుకొచ్చారు. కరోనా తర్వాత పరిస్థితులను అంచనా వేసి మార్గదర్శకాలు సిద్దం చేసినట్టు మంత్రి సురేష్ స్పష్టం చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa