ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 20%మందికి తెలియకుండానే కరోనా వచ్చి పోయింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 11, 2020, 01:34 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. భారతదేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్కటి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా కట్టడి కోసం ఎంతగా శ్రమిస్తున్నా జనంలో చాలా మందికి కరోనా వచ్చినట్లు తెలియకుండానే వచ్చిపోతున్నట్లు గుర్తించింది. ఏపీలో కరోనా వ్యాప్తిపై సీరో సర్వైలైన్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.రాష్ట్రంలో 19.7 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని నిర్ధారించారు. సీరో సర్వైలెన్స్‌ నిర్వహించిన సర్వే ఫలితాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో దాదాపు 20 శాతం మందికి తెలియకుండానే కరోనా వచ్చిపోయినట్లు తేలిందని సీరో సర్వైలెన్స్ తెలిపింది. ఆగస్టులో రెండు దపాలుగా నిర్వహించిన సర్వేలో 19.5 శాతం మంది పురుషులకు కరోనా వచ్చి పోయినట్టు గుర్తించారు. అలాగే 19.9 శాతం మంది మహిళలకూ కూడా కరోనా వచ్చి పోయినట్టు గుర్తించారు.ఇక పట్టణాల్లో అయితే 22.5 శాతం మందికి కరోనా వచ్చి తగ్గినట్టు నిర్ధారించారు. గ్రామీణ ప్రాంతాల్లో 18.2శాతం మందికి కరోనా వచ్చిపోయిందని నిర్ధారించారు. మరోవైపు కంటైన్మెంట్ జోన్లలో 20.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్టు గుర్తించారు. నాన్ కంటైన్ మెంట్ జోన్లలో 19.3 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్టు వెల్లడించారు. ఏపీలో కరోనా వచ్చి పోయినవారిలో 20.3 శాతం మంది హైరిస్క్‌లో ఉన్నట్టు సర్వేలో నిర్ధారణ అయ్యిందని తెలిపింది. ఏపీ ప్రజల్లో చాలామందికి తెలియకుండానే కరోనా వచ్చిపోయిందని తెలిపింది.అయితే ఎవరికి కరోనా వచ్చి తగ్గిపోయిందో అని గుర్తించడం కష్టతరంగా ఉందన్నారు. ఎవరికి కరోనా వచ్చి తగ్గిందో గుర్తించేందుకు నిర్వహించిన ఈ సర్వేలో కరోనా లక్షణాలు కనిపించని వారితో పాటు ఒకటి రెండు లక్షణాలు కనిపించిన వారి శాంపిల్స్‌ తీసుకుని పరీక్షించారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఆగస్టు నెలలో తూర్పుగోదావరి, అనంతపురం, నెల్లూరు, కృష్ణా జిల్లాలో రెండు దఫాలుగా ఈ సర్వే నిర్వహించారు. ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకూ సర్వే జరిగినట్లు సంస్థ ప్రకటించింది. ఆగస్టు 26 నుంచి 31 వరకూ మిగిలిన 9 జిల్లాల్లో రెండో దఫా సర్వే నిర్వహించినట్లు తెలిపింది. అయితే ఈ సర్వేలో 20 శాతం మందికి కరోనా వచ్చినట్లు తెలియకుండానే వచ్చి పోయిందని తేలడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa