ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ 2020 పరీక్షల నిర్వహణకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అందులో భాగంగా ఎంసెట్ కు సంబంధించి హాల్ టికెట్స్ విడుదలయ్యాయి. ఈనెల 17 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ పరీక్ష కోసం 2,72,720 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఎంసెట్ పరీక్ష ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహణ జరుగుతుంది.ఈనెల 17 నుంచి 23 వరకు ఇంజనీరింగ్ ఎంసెట్ ఆ తర్వాత రోజుల్లో అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు మెుదటి సెషన్...మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరగనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విద్యార్థులు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. sche.ap.gov.in/ వెబ్సైట్లో అడ్మిట్ కార్డ్స్ ఉన్నాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునే విధానం
1. విద్యార్థులు ముందుగా sche.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
2. హోమ్ పేజీలో AP EAMCET 2020 ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
3. అందులో డౌన్ లోడ్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
4. వివరాలన్నీ కరెక్ట్ గా ఎంటర్ చేసిన తర్వాత డౌన్ లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే అడ్మిట్ కార్డ్ కనిపిస్తోంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. .
విద్యార్థులు పరీక్షకు వెళ్లే ముందే హాల్ టికెట్లోని నియమాలను ఖచ్చితంగా ఫాలో అయితే చాలా మంచిది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa