కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్ గడువును పెంచింది. మరో మూడేళ్ల వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అంటే 2023 మార్చి 31 వరకు మీరు ఈ పథకంలో చేరొచ్చు. ఈ స్కీమ్లో కేవలం సీనియర్ సిటిజన్స్ మాత్రమే చేరడానికి అవకాశముంది. అంటే మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటే వారి పేరుపై ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. పీఎం వయ వందన యోజన స్కీమ్లో చేరడం వల్ల సీనియర్ సిటిజన్స్కు స్థిర వడ్డీ రేటుతో పదేళ్ల పాటు డబ్బులు అందిస్తారు. అయితే ఇక్కడ మీరు ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు డిపాజిట్ చేసే డబ్బులు ప్రాతిపదికన మీకు నెలనెలా వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలను దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) చూసుకుంటుంది. మీరు ఈ పథకంలో చేరితే మీ ఇన్వెస్ట్ చేసే డబ్బుకు 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్లో ఇప్పటి వరకు 6 లక్షల మందికి పైగా చేరారు.ఎల్ఐసీ వయ వందన యోజన స్కీమ్లో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందొచ్చొ ఒకసారి తెలుసుకుందాం. కనీసం 60 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ పథకంలో చేరొచ్చు. ఒక వ్యక్తి గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. నెలకు కనీసం రూ.1,000 నుంచి పెన్షన్ లభిస్తుంది. గరిష్టంగా నెలకు రూ.9,250 వరకు పొందొచ్చు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున ఈ డబ్బులు తీసుకోవచ్చు. ఎల్ఐసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నేరుగా పాలసీ కొనుగోలు చేయొచ్చు. వయ వందన యోజన స్కీమ్ ద్వారా ప్రతి నెలా డబ్బులు పొందటమే కాకుండా మరో బెనిఫిట్ కూడా ఉంది. అది రుణ సదుపాయం. అంటే ఈ పాలసీపై లోన్ పొందొచ్చు. దీనికి మీరు స్కీమ్లో చేరి మూడేళ్లు దాటాలి. ఇంకా స్కీమ్లో చేరిన వారి భాగస్వామి అనారోగ్యానికి గురైతే పాలసీ వెనక్కి ఇవ్వొచ్చు. 98 శాతం సెరండర్ వ్యాల్యూ లభిస్తుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa