ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5 పైసలకే చికెన్ బిర్యాని..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 09, 2020, 08:24 PM

చికెన్ బిర్యానీ పేరు చెబితే నోరు ఊరిపోతుంది కదూ..ప్లేటు చికెన్ బిర్యాని తినాలంటే కనీసం రూ. 100 అయినా ఉంటుంది. కానీ ఓ వ్యాపారి మాత్రం కేవలం 5పైసలకే ప్లేటు చికెన్ బిర్యాని అమ్ముతున్నాడని 10 టీవీ కథనం పేర్కొంది. 5 పైసలకే చికెన్ బిర్యానీతో పాటు పెరుగు పచ్చడి, వంకాయ కుర్మా కూడా లభిస్తోందని తెలిపింది. 5పైసలకే బిర్యానీ అంటే అస్సలు నమ్మబుద్ది కాదు ఎందుకంటే 5 పైసలే కాదు 10పైసలు, 25పైసలు, 50 పైసలుకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఆ కాయిన్స్ కనిపిస్తే దాచుకుని స్వీట్ మెమోరీస్‌ గా చూసుకోవాల్సిన పరిస్థితి. కానీ వాటిని గుర్తు చేస్తూ ఓ వ్యాపారి 5 పైసలకే ప్లేట్ చికెన్ బిర్యానీ తో పాటు పెరుగు పచ్చడి, వంకాయ కుర్మా అందిస్తున్నారు. చెన్నైలోని రామనాథపురంలో ఫరత్‌ అనే ఓ హోటల్ యజమాని.రామనాథపురం, కీళక్కరై, పనైకుళం ప్రాంతాల్లో ఉండే హోటళ్ల మధ్య ఫరత్‌ కొత్తగా బిర్యానీ హోటల్ తెరిచాడు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్తగా..ఎవ్వరూ ఊహించని విధంగా ఆఫర్ ప్రకటించాలనుకున్నాడు. కేవలం 5 పైసలకే ప్లేటు చికెన్ బిర్యానితో పాటు పెరుగు పచ్చడి, వంకాయ కుర్మా అని ప్రకటించాడు. అంతే జనాలు విరగబడి మరీ వచ్చేశారు. కండిషన్ అప్లై అంటూ కేవలం 5 పైసలు చిల్లర తెచ్చినవాళ్లకు మాత్రమేనంటూ ప్రకటించారు. దీంతో జనాలు 5పైసల బిర్యాని తినటానికి తమ ఇంట్లో దాచి పెట్టుకున్న ఐదు పైసల కోసం వెతుక్కుని మరీ వచ్చేశారు.దీని గురించి హోటల్ యజమాని ఫరత్‌ మాట్లాడుతూ.. ‘రామనాథపురం ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులో కొత్త బిర్యానీ హోటల్‌ను మొదలుపెట్టాను. పాత నాణేలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే కాకుండా, హోటల్ నలుగురికి తెలియాలని ఆ పని చేశాను. దాదాపు 150 మంది వరకు 5 పైసలు చెల్లించి బిర్యానీ కొన్నారని అని ఫరత్‌ ఆనందం వ్యక్తంచేశాడు'.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa