మహిళలు తమ కాళ్లపై వాళ్లు నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం మంచి అవకాశాలను ఇస్తుంది. రకరకాల పథకాలతో చేయూతనిస్తుంది. వ్యాపారాల్లో రాణించేవారికి లోన్లు, చేతిలో ఏదైనా విద్య ఉన్నవాళ్లకు సంబంధిత పరికరాలు ఉచితంగా ఇచ్చి ప్రోత్సహిస్తుంది. సమాజంలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నా వెనకబడే ఉంటున్నారు. వారిపై చిన్నచూపు, వివక్షత కామన్ అయిపోయాయి.అందుకే మహిళా సాధికారత, సమానత్వం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మహిళల కోసం సంక్షేమ పథకాలను, మహిళల ప్రయోజనాల కోసం ప్రణాళికలను ప్రవేశపెడుతూనే ఉంది. సిటీల్లో ఉండే మహిళలకే కాదు.. గ్రామీణ మహిళలకు బాసటగా నిలుస్తుంది. స్కిల్స్ డెవలప్ ట్రైనింగ్ ఇచ్చి గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే మహిళా కొయిర్ యోజన పథకం. ఈ పథకం చాలా తక్కువ మందికే తెలుసే అవకాశం ఉంటుంది.మహిళా కొయిర్ యోజన పథకం గ్రామీణ మహిళల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాధికారత కార్యక్రమం. ఈ పథకం ద్వారా కొబ్బరి ఉత్పత్తికి సంబంధించి ప్రాసెసింగ్లో గ్రామీణ మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ అనంతరం సబ్సిడీ రేటుతో స్పిన్నింగ్ పరికరాలను అందిస్తుంది. సంబంధిత చేతి వృత్తుల వారికి స్వయం ఉపాధి కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. కొయిర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ పథకం కొనసాగుతుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, లక్షద్వీప్, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో ఈ పథకం అమల్లో ఉంది.కొయిర్ బోర్డు శిక్షణా కేంద్రాల ద్వారా మహిళలకు జనపనారను తిప్పడంలో శిక్షణను అందిస్తుంది. రెండు నెలల పాటు శిక్షణ ఉంటుంది. అలాగే ఈ ఎంసీవై పథకం కింద శిక్షణ పొందుతున్న మహిళలకు నెలవారీ స్టైఫండ్ రూ. 1000లు అందిస్తుంది. ఈ పథకం కింద శిక్షణ కోసం ఇంట్లో ఒక్క మహిళే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు నమ్మకమైన కొయిర్ ఉత్పత్తి పరికరాలను కొనుగోలు చేయడంలో బోర్డు సహాయపడుతుంది. శిక్షణ అనంతరం కొయిర్ బోర్డు మోటరైజ్డ్ పరికరాలను పంపిణీ చేస్తుంది. కొయిర్ ప్రొడక్షన్కు ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుంది.ప్రభుత్వ అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఎంసీవై పథకం కింద సుమారు 1600 మంది మహిళలకు విజయవంతంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. తీరప్రాంతం నుంచి అర్హత ఉన్న మహిళలకు సుమారు 150 ప్రత్యేక మోటరైజ్డ్ మెషిన్లను పంపిణీ చేశారు. ఈ పథకం కింద అర్హత ఉన్న మహిళలు కొత్త మెషిన్ కొనుగోలుకు మొత్తం ఖర్చులో 75 శాతం సబ్సిడీ అందిస్తుంది. లేదంటే మెషిన్ కోసం లబ్ధిదారులకు రూ. 7,500 అందిస్తుంది. కొయిర్ బోర్డు కూడా కొంత రాయితీని ఇస్తుంది. కొయిర్ బోర్డు శిక్షణా కేంద్రాల ద్వారా ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.గ్రామాల్లో చదువు లేక, ఏం చేయాలో తోచక డబ్బు కోసం చాలామంది మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం ఇలాంటి పథకం ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటి పథకాల గురించి చాలామంది మహిళలకు తెలియదు. అలాంటివాళ్లకు తెలిసేలా ఈ విషయాన్ని షేర్ చేయండి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa