స్టే్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీపికబురు అందించింది. సరికొత్త లోన్ ప్రొడక్ట్ను తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. రైతులకు సులభంగానే రుణాలు అందించాలనే లక్ష్యంతో ఈ లోన్ స్కీమ్ను తీసుకువస్తున్నట్లు బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.సఫల్ పేరుతో అన్నదాతలకు సులభమైన నిబంధనల మేరుకు రుణాలు అందిస్తామని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ శెట్టి తెలిపారు. ఫిక్కీ ఫిన్టెన్ సమావేశంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. వ్యాపార కార్యకలాపాలు మరింత విస్తరించడానికి, బిజినెస్ పెరుగుదలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషీన్ లెర్నింగ్ (ML) వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తామని వివరించారు.రిటైల్ రుణ విభాగ పరిధిని దాటేసి రైతులకు మరింత చేరువ కావాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు. అన్నదాతలకు కేవలం పంట రుణాలు మాత్రమే కాకుండా ఇతర రుణాలు కూడా అందిస్తామని పేర్కొన్నారు. సేఫ్ అండ్ ఫాస్ట్ అగ్రికల్చర్ లోన్స్ (SAFAL)కు శ్రీకారం చుడతామని వివరించారు.ఇకపోతే ఎస్బీఐ తీసుకురానున్న సఫల్ లోన్ స్కీమ్ కేవలం సేంద్రీయ పత్తి సాగుదారులకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశముంది. వీరికి బ్యాంకుల నుంచి పంట రుణాలు లభించడం లేదని, అందుకే ప్రత్యేకమైన స్కీమ్ను తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు. వీరికి ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేకపోయినా కూడా రుణాలు అందిస్తామని పేర్కొన్నారు.కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ద్వారా లాక్ డౌన్ కాలంలో ఏకంగా 17 లక్షల ప్రిఅప్రూవ్డ్ రుణాలు మంజూరు చేశామని శెట్టి వివరించారు. బ్యాంకుకు చెందిన ఏఐ-ఎంఎల్ విభాగం ద్వారా చాలా బిజినెస్ జరుగుతోందని తెలిపారు. గత రెండు రోజుల్లోనే రూ.1,100 నికర ఆదాయం అర్జించామని పేర్కొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa