ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరు టీమ్ సమతూకంగా ఉంది: విరాట్ కోహ్లీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 08, 2020, 08:11 PM

2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ కనీసం ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయిన బెంగళూరు టీమ్.. మూడు సార్లు మాత్రం ఫైనల్‌కి చేరింది. కానీ.. తుది పోరులో ఒత్తిడిని జయించలేక బోల్తాపడింది.2016 ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్‌కి చేరిన బెంగళూరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన మూడు ఐపీఎల్ సీజన్లలోనూ కనీసం ప్లేఆఫ్‌కి కూడా ఆర్సీబీ అర్హత సాధించలేదు. ప్లేఆఫ్ సంగతి అటుంచితే పాయింట్ల పట్టికలోనూ ఆ జట్టు స్థానం చివరే. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్‌లు టీమ్‌లో ఉన్నా.. ఆ జట్టు ఇప్పటి వరకూ టైటిల్ విజేతగా నిలవలేకపోవడానికి కారణం డెత్ ఓవర్లలో బౌలింగ్ బలహీనత. ఈ విషయాన్ని ఆ జట్టు స్పిన్నర్ చాహల్‌ స్వయంగా అంగీకరించాడు.గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్ 2020కి బెంగళూరు టీమ్‌ మంచి సమతూకంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. ‘‘2016 ఐపీఎల్ సీజన్ బెంగళూరు టీమ్‌కి బాగా గుర్తుండిపోతుంది. ఆ సీజన్‌లో ఆర్సీబీ టీమ్ మంచి సమతూకంగా కనిపించింది. మళ్లీ ఇన్నాళ్లకి బెంగళూరు టీమ్‌ ఆ స్థాయిలో కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ సమతూకంగా ఉంది’’ అని కోహ్లీ చెప్పాడు. ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలంలో ఫాస్ట్ బౌలర్లు డేల్ స్టెయిన్, క్రిస్‌ మోరీస్‌లను బెంగళూరు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa