ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కు కేసుల భయం: నారాయణ ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 08, 2020, 08:08 PM

ఏపీ సీఎం జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శల దాడికి దిగారు. రైతులకు ఉచిత విద్యుత్ ను ఎత్తేసేందుకే విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే జగన్ ఈరోజు మాట తప్పారంటూ ధ్వజమెత్తారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలకు జగన్ పంగనామాలు పెడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీలను జగన్ తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా జగన్ మారిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నా జగన్ నోరు మెదపడం లేదన్నారు. జీఎస్టీ నిధులను కూడా రాష్ట్రాలకు ఇవ్వకపోయినా స్పందించడం లేదన్నారు. కేంద్ర విధానాల పట్ల ముఖ్యమంత్రులు తిరగబడే పరిస్థితి వచ్చిందని అన్నారు. కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని నారాయణ ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa