ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాన్నకు కరోనా నెగెటివ్ వచ్చింది: ఎస్పీ బాలు తనయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 07, 2020, 06:57 PM

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్ వచ్చిందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. తన తండ్రి ప్రస్తుతం ఐపాడ్ లో క్రికెట్, టెన్నిస్ కూడా చూస్తూ ఆస్వాదిస్తున్నారని, రాయగలుగుతున్నారని, చక్కగా భావవ్యక్తీకరణ చేయగలుగుతున్నారని చరణ్ వివరించారు. అంతేగాకుండా, వారాంతంలో తన తల్లిదండ్రులు పెళ్లిరోజు కూడా సెలబ్రేట్ చేసుకున్నారని తెలిపారు.అయితే, వెంటిలేటర్ తొలగింపుపై కాస్త సమయం పడుతుందని అన్నారు. అయన ఊపిరితిత్తులు ఇంకా పూర్తిస్థాయి సామర్థ్యం సంతరించుకోలేదని, అందుకే వెంటిలేటర్ సాయం కొనసాగిస్తున్నారని చెప్పారు. తన తండ్రి కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆయనకు నెగెటివ్ వచ్చినా తాము, దాని గురించి పట్టించుకోవడంలేదని, ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా బాగుపడడంపైనే దృష్టి సారించామని తెలిపారు. ఆగస్టులో కొవిడ్ కారణంగా ఎస్పీ బాలు చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించడం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa