ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రాగునీటిలోను దళితుల పట్ల వివక్షత చూపడం సిగ్గు చేటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 07, 2020, 06:44 PM

కర్నూలు జిల్లా పెద్దకడబుర్ మండల పరిధిలోని చిన్నతుంభళం గ్రామంలో దళితులకు త్రాగునీరు ఇవ్వకుండా వివక్ష చూపడం దారుణమని.. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి. రామన్న విమర్శించారు. ఈ మేరకు సోమవారం చిన్నతుంభళం గ్రామంలో దళిత వాడలో ఉండే 200 దళిత కుటుంబాలకు త్రాగునీరు అందించాలని కోరుతూ డప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఎంపీడీవో కార్యాలయం ముందు దాదాపు 5 గంటలు పైగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి డివైఎఫ్ఐ మండల కార్యదర్శి బి. సుధాకర్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. చిన్నతుంభళం గ్రామంలో నివసిస్తున్న దాదాపు 200 దళిత కుటుంబాలకు త్రాగునీరు ఇవ్వకుండా వివక్ష చూపడం సిగ్గు చేటు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa