ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల్లో నిద్రలేమి సమస్య..! ఎముకలు బలహీనపడే ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 06, 2020, 08:09 PM

మహిళలకు పోషకాహారం, మంచినీళ్లు లాగానే.. నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర... మానసిక, శారీరక ఆరోగ్యాలను చాలా ప్రభావితం చేస్తుంది. బాగా నిద్రపోతున్నప్పుడు మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. మంచి నిద్ర అనారోగ్య సమస్యలను దూరం చేస్తోంది. అయితే మగవాళ్ల కంటే ఆడవాళ్లు నిద్రలేమి సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు.పీరియడ్స్, గర్భం, మెనోపాజ్ సమయాల్లో హార్మోన్లలో మార్పు వస్తుంది. శరీరంలో హార్మోన్లలో మార్పుల వల్ల మహిళల్లో నిద్ర లేమి సమస్య తలెత్తుంది. నిరాశ, ఆందోళన ఉన్నవారిలో కూడా నిద్ర లేమి ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో మహిళలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. మహిళలు రాత్రి పూట ఏడు గంటల పాటు నిద్రపోవాలి. గర్భిణీలైతే తప్పనిసరిగా తొమ్మిది గంటలపాటు నిద్ర పోవాలి.సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మహిళల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో తెలిపారు. దీనివల్ల మహిళలో చురుకుతనాన్ని కోల్పోయి బలహీనంగా మారుతారు. అవసరమైనదానికంటే తక్కువ సమయం నిద్రపోయే వారికి ఎముకలో ఖనిజ సాంద్రత (బీఎండీ) తగ్గుతుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంది. ఫలితంగా ఎముకలు పెళుసుబారి విరిగిపోతాయని వైద్యుల పరిశోధనల్లో తెలిసింది. రుతుక్రమం ఆగిపోయిన 11 వేల మంది మహిళలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఈ విషయాన్ని తేల్చారు. రాత్రి వేళ ఏడు గంటలు నిద్రపోతున్న మహిళలతో పోలిస్తే 5 గంటలకంటే తక్కువ సమయం నిద్రిస్తున్నామని చెప్పిన వారికి బీఎండీ తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అందుకే నిద్ర విషయంలో మహిళలు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల నిద్ర లేమి సమస్యకు దూరంగా ఉండొచ్చు. సాధారణంగా నిద్ర వచ్చినప్పుడు వెంటనే నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఆపై ప్రతి ఉదయం అదే సమయంలో లేచేలా అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ వల్ల నిద్ర కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. పడుకునే గది నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, స్నానం చేయడం వంటివి నిద్ర రావడానికి సహాయపడతాయి. ఒక వేళ పడుకున్న 20 నిమిషాల్లో నిద్ర లేకపోతే మగతగా అనిపించకపోతే మంచం నుంచి లేచి నిద్ర వచ్చేవరకు మరేదైనా చేయడం మంచిది. అలాగే టీవీ చూడడం, ఫోన్ చూడడం వంటి బంద్ చేయాలి.మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయో చూశారుగా. ఇలాంటి సమస్యల గురించి ఎవరికీ తెలియదు. జనరల్ సమస్య అనుకుని వదిలేస్తారు. దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa