విశాఖ జిల్లా చోడవరం నియోజవర్గం చోడవరం పట్టణం ఇందిరా కాలనీలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సమావేశం నిర్వయించారు. చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి యలక మల్లి బాబు మాట్లాడుతూ, 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో, ఎస్సీ వర్గీకరణ కోసం అనేక ఉద్యమాలు చేపట్టామని, ఆదివారం ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు. ఇది రాష్ట్రాలకు అధికారం ఉంది అని సుప్రీం కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వర్గీకరణ కోసం పోరాటం చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు, ఎస్సీల ఏబిసిడి వర్గీకరణకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, ఎలక అప్పారావు, కంటి పాము దాసు, ఎలక రాజు, ఎలక గణేష్, నర్సింగరావు, గోవిందరావు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa