ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సానిటైజేర్ తాగి వృద్దుడు మృతి'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 06, 2020, 07:55 PM

శానిటైజర్‌ తాగి వృద్ధుడు మృతి చెందిన ఘటనపై మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలు.. స్థానిక జైఆంధ్రకాలనీలో నివాసం ఉంటున్న పైడిశెట్టి గురువులు(65) గత రెండేళ్ల నుంచి కుటుంబీకులను వదిలేసి ఆరుబయట బహిరంగ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నాడు. మద్యం అలవాటు ఉన్న అతడు తెల్లవారుజామునే యారాడ బస్‌స్టాపు వద్ద కూర్చుని శానిటైజర్‌ తాగి పడిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ కేసుని సీఐ కె.దుర్గాప్రసాద్‌ పర్యవేక్షణలో సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa