కర్నూలు జిల్లాలోని కర్నూలు నగరంలో నాలుగైదేళ్ల క్రితం గాయపడి దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక చేతి కదలికలు దాదాపు పూర్తిగా కోల్పోయిన వ్యక్తికి అత్యంత అరుదైన లెటార్జెట్ ప్రొసీజర్ అనే అరుదైన శస్త్రచికిత్స చేసి, అతడికి చేతి కదలికలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. కర్నూలు కిమ్స్ కర్నూలు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ జీవీఎస్ రవిబాబు. ఈ చికిత్స పద్ధతి గురించి, కేసు గురించిన పూర్తి వివరాలను ఆయన ఇలా వెల్లడించారు.అనంతపురం జిల్లాకు చెందిన గోపీచంద్ (20) అనే యువకుడు నాలుగైదేళ్ల క్రితం క్రికెట్ ఆడుతూ జారిపడటంతో అతని కుడి చేతి ఎముక పక్కకు జరిగింది. మాములు నొప్పే అనుకుని నిరక్ష్యం చేసిన అతను కొన్ని రోజుల వరకు వైద్యులను సంప్రదించలేదు. తర్వాత కొంత కాలానికి కొందరు వైద్యుల వద్దకు వెళ్లినా, సమస్యను పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల సరైన చికిత్స జరగలేదు.నాలుగైదేళ్ల పాటు ఇలాగే నిర్లక్ష్యం చేసి, క్రికెట్ ఆడటం సహా అన్ని పనులూ చేయడంతో ఈ మధ్య కాలంలో దాదాపు 30-40 సార్లు ఎముక పక్కకు జరిగింది. అది అతడికి చాలా బాధాకరంగా మారింది. అనంతపురం జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేసే ఆ యువకుడి తల్లి.. తర్వాత అతడికి ఎంఆర్ఐ తీయించి కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి పంపారు. అతడిని పూర్తిగా పరీక్షించినప్పుడు బంతిగిన్నెకీలు కూర్చునే ప్రాంతం (గ్లెనాయిడ్ కప్) అరిగిపోయినట్లు తెలిసింది.దీనివల్ల ఏమాత్రం కదిలించినా చేతి ఎముక జారిపోతుంది. గ్లెనాయిడ్ కప్లో నాలుగోవంతు పూర్తిగా అరిగిపోయింది. దీంతో ఎముక జారిపోతుందన్న భయంతో కొన్నాళ్లుగా అతడు కుడిచేతిని వాడటం మానేసి కేవలం ఎడమచేత్తోనే అన్ని పనులూ చేసుకుంటున్నాడు. పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాత లెటార్జెట్ ప్రొసీజర్ అనే పద్ధతిలో అతడికి శస్త్రచికిత్స చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa