ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్ల ప్రారంభం వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 5న స్కూల్స్ తెరవాలన్న నిర్ణయాన్ని అక్టోబర్ 5కి వాయిదా వేసింది. అలాగే జగనన్న విద్యాకానుక పథకాన్ని కూడా అదే రోజు ప్రారంభించాలని నిర్ణయించింది. వాస్తవానికి సెప్టెంబర్ 5 నుంచే స్కూల్స్ ఓపెన్ చేయాలని జగన్ సర్కార్ ప్రయత్నించింది. స్కూల్స్ కు వెళ్లే విద్యార్ధులకు మాస్క్, బుక్స్, స్కూల్ యూనిఫారమ్, బ్యాగ్స్ ఉండేలా రంగం సిద్ధం చేసింది. కరోనా నేపధ్యంలో గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ ను ప్రారంభిస్తామని మంత్రి సురేష్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో స్కూల్స్ ను ఈనెలాఖరు వరకు ఓపెన్ చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు తెరవకూడదన్న కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభోత్సవాన్ని కూడా వాయిదా వేసింది. అక్టోబర్ 5న పథకం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa