ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకు వద్ద రైతులు ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 04, 2020, 03:22 PM

డోన్ పట్టణ ఆంధ్రబ్యాంకుని దాదాపు 100 మంది రైతులతో కలిసి సిపిఐ పార్టీ నాయకులు ముట్టడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుంకయ్య, క్రిష్ణగిరి మండల సహాయ కార్యదర్శి రవి మోహన్ మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంగా రాయదుర్గం పరిధిలోని వ్యవసాయ రంగానికి, రైతులకు ప్రభుత్వం అందించే పంట నష్టపరిహారం, వాతావరణ బీమా, సబ్సిడీ పథకాలు, తదితర రుణాలు రైతులకు అందకుండా డోన్ ఆంధ్ర బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బ్యాంకు ఎదుట రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మోట రాముడు, రైతులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa