ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తే రూ.83వేలు లాభం..త్వరపడండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 04, 2020, 03:13 PM

ప్రతీ ఒక్కరూ ఫిక్సిడ్ డిపాజిట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తమ చిన్నారుల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలో ఫిక్సిడ్ డిపాజిట్ లపై మెుగ్గు చూపుతున్నారు. దాంతో ఆయా బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతూ ఆకర్షిస్తున్నాయి. అయినప్పటికీ పోస్ట్ ఆఫీస్ కు మాత్రం పోటీ ఇవ్వడం లేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో చేతిలో డబ్బులు ఉన్న వారు ఎక్కడ ఫిక్సిడ్ డిపాజిటివ్ చెయ్యాలా అన్న దానిపై ఆలోచనలో పడ్డారు. అయితే రిస్క్ లేకుండా పెట్టిన డబ్బుకు మంచి రాబడి పొందాలంటే పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం మంచిది.అయితే ఫిక్సిడ్ డిపాజిట్ పోస్టాఫీస్‌లో చేయాలా? లేదా స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో డబ్బులు పెట్టాలా? అనే విషయానికి వస్తే ఎందులో డబ్బులు పెడితే ఎక్కువ లాభం వస్తుందో ఓసారి తెలుసుకుందాం. బ్యాంకుల్లో అయితే 10 ఏళ్ల కాల పరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయోచ్చు. అదే పోస్టాఫీస్‌లో అయితే ఐదేళ్ల వరకే ఛాన్స్ ఉంది. మెచ్యూరిటీ గడువు మాత్రం పొడిగించుకోవచ్చు.ఎస్‌బీఐ, పోస్టాఫీస్‌లో డబ్బులు పెడితే ఒకే రకమైన వడ్డీ మాత్రం రాదు. పోస్టాఫీస్‌లో మాత్రం ఎక్కువ వడ్డీ లభిస్తోంది. ఎస్‌బీఐ కన్నా పోస్టాఫీస్‌లో 1.3 శాతం అధిక వడ్డీ పొందొచ్చు. అంతేకాకుండా మీరు పోస్టాఫీస్‌లో పెట్టిన డబ్బుకు మెుత్తం పూర్తి భద్రత ఉంటుంది. బ్యాంక్‌లో అయితే రూ.5 లక్షల వరకే సెక్యూరిటీ ఉంటే అదే పోస్టాఫీస్ లో అయితే రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఇకపోతే మీరు పోస్టాఫీస్‌లో రూ.10 లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఐదేళ్ల కాలపరిమితికి వడ్డీ రేటు 6.7 శాతం పొందవచ్చు. మెచ్యూరిటీ తర్వాత రూ.13.83 లక్షలు పొందొచ్చు. అదే రూ.10 లక్షలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తే ఐదేళ్ల తర్వాత చేతికి కేవలం రూ.13 లక్షలు మాత్రమే వస్తాయి. అంటే ఎస్.బి.ఐ కంటే పోస్టాఫీస్ లో ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తే రూ.83 వేలు అధికంగా పొందవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa