ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగరంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలి : సీపీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 03, 2020, 06:57 PM

కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 42 వార్డులో గల బళ్లారి చౌరస్తాలో ప్రధాన డ్రైనేజీ కాలవకు డిస్పోజల్ లేక గత నాలుగు నెలలుగా ప్రధాన రోడ్లపై ప్రవహించడంతో రోడ్డుపై మురికి కుంటగా ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని సీపీఎం పార్టీ ప్రతినిధి బృందం నగర కార్యదర్శి టి.రాముడు, జె.కిరణ్మయి, వై.సుధాకర్ రెడ్డి, ఏ.మురళి తదితరులు పరిశీలించారు.ఈ సందర్భంగా నగర కార్యదర్శి టి.రాముడు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా బళ్లారి చౌరస్తా లోని ప్రధాన డ్రైనేజీ కాలువ డిస్పోజల్ లేక కాలనీల నీరు మురికి కుంటగా ఏర్పడి రోడ్లపై ప్రవహిస్తు దుర్వాసనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా కార్పొరేషన్ సిబ్బందికి గాని, కమిషనర్ కు గాని పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అనేక మార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకు పోయినప్పటికీ ఈ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న కలెక్టర్ జోక్యం చేసుకుని తక్షణమే డ్రైనేజీ కాలవలు నిర్మించి మురికి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్న మద్దిలేటి, నాగేశ్వరరెడ్డి, రాముడు, మధు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa