ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేకాట ప్రియులపై ఉక్కుపాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 03, 2020, 06:56 PM

జూదం ఒక మహమ్మారి. జూదం పిల్లల భవిష్యత్తుతో పాటు కుటుంబాలను రోడ్డు పాలు చేసేది. జూదం పలు రకాలు. అందులో ఎక్కువగా జూదగాళ్లు ఆశ్రయించేది పేకాట. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము పేకాటలో పోగొట్టుకోవడమే కాకుండా ఇంట్లో వస్తువులను కూడా తాకట్టు పెట్టి పేకాట ఆడుతూ సరదా తీర్చుకుంటుంటారు పేకాటరాయుళ్లు. అది సరిపోకపోతే ఆఖరికి భార్య మెడలోని బంగారాన్ని కూడా అమ్మటానికి వెనకాడరు ఈ జూదగాళ్లు. ఈ పేకాటతో కుటుంబాలు రోడ్డు పాలు అవుతూ ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడంతో ప్రభుత్వాలు పేకాటపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.భారతదేశంలో బ్రిటిష్ కాలంలోనే 1867 సంవత్సరం నుండి జూదం ఆడటం నేరం అని అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. కానీ 1947 స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశ ప్రభుత్వం కూడా పేకాటపై ఉక్కుపాదం మోపుతూ.. పేకాట ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకువచ్చింది. అయినా కానీ పేకాట రాయుళ్లు మాత్రం దొంగచాటుగా పేకాట ఆడుకుంటూ తమ కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పోలీసులు పేకాట ఆడుతున్నారని సమాచారంతో వారిని పట్టుకోవడమే కాకుండా జరిమానాలు విధించి పేకాట ఆడుతున్న సమయంలో ఉన్న నగదు మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పేకాటపై ఉక్కుపాదం మోపుతూ వస్తుంది.కానీ మారుతున్న కాలంతో పాటు వస్తున్న టెక్నాలజీతో కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటూ పేకాట ఆడుతూ తమ కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారు. ఆన్ లైన్ రమ్మీ అంటూ మారిన ట్రెండ్ తో స్మార్ట్ ఫోన్లో ప్లే రమ్మీ ఆడుతూ లక్షలు లక్షలు పోగొట్టుకున్న వారి సంఘటనలు అనేకం. అయితే ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించి ఆన్ లైన్ లో ప్లే రమ్మీ ని కూడా బ్యాన్ చేసి నిషేధించాలని నిర్ణయం తీసుకుని అందులో భాగంగా ఆన్ లైన్ లో ఇక ప్లే రమ్మీ ఆడితే ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే విధంగా నిర్ణయం తీసుకుంది. జూదాన్ని అరికట్టాలని ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారా.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa