కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని సి.బెళగల్ మండలంలోని కంబదహల్, చింతమాన్ పల్లె గ్రామలలోని ఎత్తిపోతల పథకాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ ప్రారంభించారు. ఆయా గ్రామాల రైతుల ఆహ్వానం మేరకు హాజరైన కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ స్థానిక మండల వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి సాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో గొప్ప పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికి మాత్రమే సొంతమని, జగనన్న పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా సస్యశ్యామలం అవుతుందని రాబోయే రెండు మూడేళ్లలో కర్నూలు జిల్లాకు జీవనాడి అయిన గుండ్రేవుల ప్రాజెక్టును ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa