ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం జగన్ కాన్వాయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 02, 2020, 06:41 PM

ఏపీ సీఎం జగన్ కాన్వాయ్ అంబులెన్స్ కు దారిచ్చింది. పులివెందుల నుంచి గన్నవరం విమానాశ్రయానికి తిరిగొచ్చిన సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. ఆ సమయంలో గూడవల్లి నిడమానూరు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అంబులెన్స్‌ వచ్చింది. దీనిని చూసిన సీఎం కాన్వాయ్ లోని సిబ్బంది సీఎం కాన్వాయ్ ను పక్కకు జరిపి అంబులెన్స్ కు దారిచ్చారు. గాయపడ్డ వ్యక్తిని ఉయ్యూరు నుంచి గన్నవరం వెళుతున్న చాపర్తిన శేఖర్ గా గుర్తించారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa