ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిగ్రీ అర్హతతో 1557 ప్రభుత్వ ఉద్యోగాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 02, 2020, 01:31 PM

ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో మొత్తం 1557 పోస్టుల్ని ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనెరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకుల్లో ఈ పోస్టులున్నాయి. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐబీపీఎస్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 23 చివరి తేదీ. ప్రిలిమ్స్ డిసెంబర్‌లో మెయిన్స్ వచ్చే ఏడాది జనవరిలో ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను www.ibps.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.


రాష్ట్రాల వారీగా ఉన్న పోస్టుల వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్- 10, తెలంగాణ- 20,అరుణాచల్ ప్రదేశ్- 1, అస్సాం - 16,బీహార్- 76, చండీగఢ్ - 6, చత్తీస్‌గఢ్ - 7, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ- 4,ఢిల్లీ - 67,గోవా - 17,గుజరాత్- 119,హర్యానా- 35, హిమాచల్ ప్రదేశ్- 40,జమ్మూ కాశ్మీర్ - 5,జార్ఖండ్- 55,కర్నాటక - 29,


కేరళ- 32,లక్షద్వీప్ - 2,మధ్యప్రదేశ్- 75,మహారాష్ట్ర - 334,మణిపూర్- 2,మేఘాలయ - 1,మిజోరం- 1,నాగాలాండ్- 5,ఒడిషా- 43,పుదుచ్చెరీ- 3,పంజాబ్- 136,రాజస్తాన్ - 48,సిక్కిం- 1,


తమిళనాడు - 77,త్రిపుర - 11,ఉత్తరప్రదేశ్- 136,ఉత్తరాఖండ్- 18,పశ్చిమబెంగాల్- 125 పోస్టులున్నాయి.


దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 2.


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 23.


ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్- 2020 డిసెంబర్ 5, 12, 13.


ప్రిలిమ్స్ ఫలితాల విడుదల- 2020 డిసెంబర్ 31.


మెయిన్స్ కాల్ లెటర్స్- 2021 జనవరి 12.


మెయిన్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్- 2021 జనవరి 24.


ప్రొవిజనల్ అలాట్‌మెంట్- 2021 ఏప్రిల్ 1.


ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ.


విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ.కంప్యూటర్ లిటరసీ- కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేయడం తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేషన్స్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి. హైస్కూల్ లేదా కాలేజీలో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి.వయస్సు- 20 నుంచి 28 ఏళ్లు.


దరఖాస్తు ఫీజు- రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‍మెన్‌కు రూ.100.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa