ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఎమ్మెల్యే తొగురు ఆర్ధర్ నివాళులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 01, 2020, 07:14 PM

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని నందికొట్కూరు పట్టణంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే తొగురు ఆర్ధర్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా నివాళులర్పించారు. దేశం గర్వించదగ్గ అత్యంత గౌరవనీయ రాజకీయ నాయకులలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఒకరిని ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. మాజీ రాష్టపతి ప్రణబ్‌ ముఖర్జీ కొద్దిరోజులుగా కరోనాతో పోరాడుతున్న అయన సోమవారం ఆర్మీ ఆస్పత్రిలో కన్నుమూశారు. రాజకీయాల్లో అప‌ర చాణిక్యుడిగా రాజ‌నీతిజ్ఞుడిగా పేరు పొందారని తెలిపారు. దేశానికి 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలను అందించారన్నారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇచ్చి దేశం ఆయనను సత్కరించిందని, వారి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa