ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి నంద్యాలలో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపు.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 01, 2020, 07:12 PM

కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని నంద్యాల పట్టణంలోని నేటి నుంచి ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి తమ షాపులను తెరుచుకోవచ్చునాని వన్ టౌన్ సీఐ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ముఖ్యంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో షాపులో యాజమాన్యం, పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. షాపులో కోనుగోలు కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ శానిటైజర్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి నంద్యాల పట్టణంలో షాపులో వద్ద నిత్యం పోలీసువారి నిఘా ఉంటుందన్నారు. పట్టణంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. ప్రజలు సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలని, అదే విధంగా అవసరం ఉందని అనుకుంటే తప్ప అనవసరంగా బయకకు రావద్దని సూచించారు. ఉదయం నుండి సాయంత్రం 5 వరకు మాత్రమే దుకాణాల ద్వారా వ్యాపారం చేసుకునే అవకాశం ఉందన్నారు. సాయంత్రం ఐదు గంటల గంట తరువాత మందుల దుకాణాలు మినహా, ఏ ఇతర దుకాణాలు, తెరవడానికి వీల్లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa