ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.3.50లక్షలకే కొత్త ఇల్లు..అది కూడా ఈఎంఐలో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 01, 2020, 07:09 PM

ప్రస్తుతం ఇళ్లు కొనుగోలు చేయాలంటే మామూలు విషయం కాదు. ఒక మంచి ఇళ్లు కొనుగోలు చేయాలంటే 30 లక్షల నుంచి కోట్లపైనే. అయితే ఇల్లు లేని నిరుపేదలకు కేంద్రం ప్రభుత్వం సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కల సాకారం కానుంది. ఈ పథకం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనుగోలు చేసేలా వెసులుబాటు తీసుకువచ్చింది. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి వడ్డీ రాయితీ లభిస్తుంది.ఈ పథకం వచ్చే ఏడాది మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వపు హౌసింగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ వినూత్నంగా ముందుకు వెళ్తోంది. ఈ స్కీమ్ కింద ప్రజల కోసం ఇల్లు కట్టించి విక్రయిస్తోంది. 19 పట్టణాల్లో 3,500కు పైగా ఇళ్లను నిర్మించింది. వీటిని ప్రజలకు విక్రయిస్తోంది. కొనుగోలు చేయాలని భావించే వారు సెప్టెంబర్ 1 నుంచే బుకింగ్ చేసుకోవాలని సూచించింది. కేవలం రూ.3.5 లక్షలకే కొత్త ఇంటిని పొందొచ్చు. అక్టోబర్ 15లోపు కొత్త ఇంటి కొనుగోలుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే ఈ పథకానికి కొన్ని కండీషన్స్ పెట్టింది.ఈ పథకం ద్వారా ఇల్లు కొనుగోలు చేయానుకునేవారి వార్షిక ఆదాయం రూ.3.5 లక్షలకు లోపు ఉండాలి. పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే అర్హులు. అర్హులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది యూపీ ప్రభుత్వం. రూ.3.50 లక్షలకు ఇళ్లు కట్టి ఇవ్వడమే కాదు ఆ సొమ్మును ఒకేసారి చెల్లించకుండా మూడేళ్లలోపు చెల్లించేలా ఛాన్స్ కూడా ఇచ్చింది. దాంతో ఉత్తర ప్రదేశ్ లో ఈ హౌసింగ్ స్కీమ్ బాగా పాపులర్ అయ్యింది. ఇలాంటి విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని పలు రాష్ట్రాల ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa