పెట్రోల్ బంకు వ్యాపారంలో ఏ స్థాయిలో ఆదాయం లభిస్తుందో అందరికీ తెలిసిందే. పెట్రోల్ బంకు నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. అందుకు అనేక అనుమతులు అవీ ఇవీ అమ్మో ఎంతో శ్రమ ఉంటుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే వాటికి ఎలాంటి పెట్రోల్ అవసరం లేదు. కేవలం విద్యుత్ చార్జ్ చేస్తే చాలు. విద్యుత్ చార్జ్ ద్వారా నడిచే వాహనాలకు డిమాండ్ పెరగడంతో విద్యుత్ చార్జీ స్టేషన్లకు కూడా డిమాండ్ మెుదలైంది. పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు ప్రకటించింది.ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ చార్జింగ్ స్టేషన్ భవిష్యత్తులో చక్కటి ఆదాయ మార్గంగా మారనుంది. వ్యాపార రంగంలో రాణించాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా మారనుంది. జపాన్కు చెందిన ఎలక్ట్రానిక్ కంపెనీ పానాసోనిక్ దేశంలోని 25 నగరాల్లో 1 లక్ష స్ట్రాంగ్ ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. భారతదేశంలో ఇప్పటికే పెట్రోల్ బంకులు విస్తరించి ఉన్నాయి. అదే స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది.భారతదేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యతో పోల్చితే ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పార్కింగ్ స్టేషన్లు, మాల్స్, పెట్రోల్ పంపుల్లో మొదలైన వాటిలో ఛార్జింగ్ స్టేషన్లను సంస్థ ఏర్పాటు చేసింది. ఇది కాకుండా, ఫ్రాంచైజీలు కూడా ఇస్తాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ మనీష్ శర్మ అన్నారు. ఈ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి పానాసోనిక్ పని చేస్తుందని తెలిపారు. ఈ విధానం ద్వారా ఎవరైనా తమ వాహనాన్ని ఎక్కడైనా ఛార్జ్ చేసుకునే వీలుండనుంది.భారత్ లోని ప్రముఖ నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్ హబ్ లను పానాసోనిక్ సంస్థ ఏర్పాటు చేసింది. మొదట ఢిల్లీ, పూణే, బెంగళూరు, చెన్నై, అమరావతి, హైదరాబాద్, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్లలో ఛార్జింగ్ స్టేషన్ హబ్ లను ఏర్పాటు చేస్తుంది. మరిన్ని ప్రాంతాల్లో విస్తరింపజేసేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్ EV ఛార్జింగ్ స్టేషన్ ను నింబస్ను కంపెనీ ప్రారంభించింది. దీని కింద, ఛార్జింగ్ స్టేషన్లు, స్వాప్ స్టేషన్లు, ఆన్ బోర్డు ఛార్జ్, టెలిమాటిక్స్ సిస్టమ్స్, క్లౌడ్ సర్వీసెస్, అనలిటిక్స్, డాష్బోర్డ్లు మరియు కృత్రిమ మేధస్సు సేవలు వంటి వర్చువల్ భాగాలు అందించనున్నారు.మొదటి దశలో పానాసోనిక్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్ అయిన స్మార్ట్ ఇ & క్యూక్విక్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కింద పానాసోనిక్ ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంలో 150 స్మార్ట్ ఇ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్, 25 క్యూక్యూవి 2 వీలర్లపై ఇవి ఛార్జింగ్ సేవలు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. భవిష్యత్ లో ఈ స్టేషన్లు మరిన్ని పెరగనున్నాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa