కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రైతు బాంధవులు, శాసన సభ్యులు ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 21వ వార్డు గీతా నగర్ లో వైయస్సార్ పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ ను వార్డు ఇన్ ఛార్జ్ లు మన్సూర్ బాషా టౌన్ బ్యాంక్ డైరెక్టర్ సయ్యద్ చాంద్ మరియు సచివాలయం సిబ్బంది లలిత , వార్డు వాలెంటెర్స్ మహేష్, లక్ష్మీ కాంత్, శ్రావణి, వార్డు ఇన్ ఛార్జ్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయసు65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు చేసి, అవ్వా తాతల పెన్షన్ రూ.1000 నుంచి నుంచి రూ. 2500 వరకు పెంపు, దశలవారీగా రూ. 3000కు పెంచారు. వికలాంగులకు రూ.3000 పింఛన్, గత ప్రభుత్వంతో పోలిస్తే పింఛన్లపై మూడు రెట్లు ఎక్కువగా లబ్ధిదారులు 58,61,120 లకు రూ. 14,438 కోట్లు ఖర్చు, మేనిఫెస్టోను ఓ భగవద్గీతలా, బైబిల్ లా, ఖురాన్ లా భావించి చిత్తశుద్ధితో మీకోసం పనిచేస్తానని ముఖ్యమంత్రి హోదాలో మీ అందరికీ మాటిస్తున్నా అని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను ప్రక్షాళన చేస్తా, అవినీతి అన్నది పైస్థాయి నుంచి కింద స్థాయి వరకూ ఎక్కడ లేకుండా చేస్తు, ప్రజలకు పక్కగా రావాల్సినవేవీ దేహీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అందిస్తామని తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa