ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎస్‌ఆర్‌ఎంవోగా హేమనళిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 01, 2020, 06:53 PM

కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశాల మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవోగా డా.బి.హేమనళిని బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవోగా ఉన్న డా.హేమనళిని 2018 జూలై 30న మొదటి సారిగా ఇన్‌చార్జి సీఎస్‌ఆర్‌ఎంవోగా పనిచేశారు.మళ్లీ కొవిడ్‌ క్లిష్ట పరిస్థితుల్లో కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్‌ బాధితులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కొవిడ్‌ బాధితులకు సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ఆమెను పలువురు వైద్యులు, సిబ్బంది అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa