ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? లేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా..? అలాంటి నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ, ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే ఛాన్స్ వచ్చేసింది. రైల్వేశాఖ 35,208 ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2020 రిక్రూట్ మెంట్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఆన్లైన్ పరీక్ష ద్వారా 35,208 పోస్టులను భర్తీ చేయనుంది. ఇకపోతే ఈ పోస్టులన్నీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించినవే కావడం విశేషం.డిగ్రీ, ఇంటర్ అర్హత కలిగిన వారికి తగ్గట్టుగా పోస్టులను కేటాయించనుంది. డిగ్రీ అర్హత కలిగిన వారికి 24,605 పోస్టులు ఉండగా, ఇంటర్ అర్హత కలిగిన వారికి 10,603 పోస్టులు ఉన్నాయి. ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు తరువాత ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షలు జరగనున్నట్లు తెలుస్తోంది. బేసిక్ శాలరీతో పాటు పలు ఇతర ప్రయోజనాలు, అలవెన్స్లు ఈ ఉద్యోగాల ద్వారా లభించనున్నాయి. ఆయా పోస్టులను బట్టి అలవెన్స్ల్లో మార్పులు కూడా ఉన్నాయి.అయితే వీటిలో కొన్ని పోస్టులకు డియిర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్టు అలవెన్స్, పెన్షన్ స్కీమ్, మెడికల్ ప్రయోజనాలుతో పాటు పలు ఇతర ప్రత్యేక అలవెన్స్లు కూడా పొందే అవకాశం ఉంది. క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్స్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, కమర్షియల్ అప్రెంటీస్, వివిధ జోన్లలో స్టేషన్ మాస్టర్ పోస్టులను ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2020 రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa