రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యులు బసాపురం గోపాల్ విమర్శించారు. మంగళవారం ఎపి రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు రైతుల డిమాండ్స్ డేలో భాగంగా 104 బసాపురం గ్రామంలో సిపిఐ రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018-19 పంట నష్టపరిహారం ఇవ్వాలని, కౌలు రైతులకు బ్యాకు రుణాలు ఇవ్వాలని, రైతులకు సరిపడ యూనియాను పంపిణీ చేయాలని, రైతులు పండించిన ప్రతి పంటకు ముందు ధరను నిర్ణయించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సమితి కార్యదర్శి ఇవి ఈరన్నగౌడ్, దొడ్డగేరి నాగరాజు, సిపిఐ గ్రామ కార్యదర్శి కరెంటు ఈరన్న, ఎఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు లింగప్ప, లింగేష్, 104 బసాపురం గ్రామ రైతులు, వ్యవసాయ కార్మిక నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa