కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని శ్రీశైలం మహాక్షేత్రంలో లోకకల్యాణం కోసం దేవస్థానం వారు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజలు చేశారు. ప్రతి మంగళవారం మరియు షష్ఠి కృతిక నక్షత్రం రోజుల్లో కుమార స్వామికి విశేష పూజలు చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయడం వల్ల లోక కల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఇబ్బందులు లేకుండా ఆయా పనులు సక్రమంగా జరుగుతాయని ఆలయ పురోహితులు తెలిపారు.సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో అప్పులు గ్రహపీడలు బాధలు దృష్టి దోషాలు తొలగి మానవుడు శక్తివంతంగ పని చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. అలాగే సంతానం కోసం పూజించే వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని అన్నారు. ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో వర్షాలు కురిసి తగిన పంటలు పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని జనులు ఆయురారోగ్యాలు కలిగి అకాల మరణాలు చెందకుండా ఉండాలని దేశంలో అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలని అన్ని ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని అర్చక స్వాములు సంకల్పాన్ని పలికారు.అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ జరిపి తరువాత సుబ్రహ్మణ్య స్వామికి విశేష అభిషేక అర్చనలు జరిపించబడ్డాయి. తర్వాత సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయబడ్డాయి. సుబ్రహ్మణ్య స్వామికి ఈ అభిషేకంలో పంచామృత లైనా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరినీళ్లు మరియు వివిధ ఫలరసాలు ఆలయ గుండాల్లోని పుణ్య జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. భౌతిక దురాన్ని పాటిస్తూ అర్చకస్వాములు కుమారస్వామికి విశేష ఆర్చనలు జరిపించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa