ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేపల చెరువు చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తాం.. కమిషనర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 01, 2020, 05:54 PM

నగరంలోని బుధవారపేట 15 వ వార్డులో ఉన్న చేపల చెరువు చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తామని.. మునిసిపల్ కమిషన్ డీకే బాలాజీ హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన చేపల చెరువును పరిశీలించారు. చేపల చెరువులో మురికి నీరు చేరి దుర్గంధం వస్తుందని తద్వారా చిన్న పిల్లలు పెద్దలు వ్యాధులబారిన పడుతున్నారని వైయస్సార్ సిపి 15 వార్డు సమన్వయకర్త కేదార్నాథ్ కమీషనర్ కు తెలిపారు.మురుగునీరు ఎక్కువగా ఉండడం వల్ల పందులు ఎక్కువ సంఖ్యలో సంచరిస్తున్నాయని వివరించారు. అనంతరం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చెరువులను శుభ్రం చేయించి ప్రహరీ గోడ నిర్మిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa