ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాస్ సిలిండర్ బుకింగ్ కు కొత్త రూల్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 31, 2020, 08:21 PM

గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలకుండా ఉండేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఓటీపీ విధానాన్ని తీసుకురానుంది. ఇప్పటికే దేశ రాజధాని న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ కొత్త విధానం అమలులోకి వచ్చింది. త్వరలో దేశమంతా ఇదే పద్ధతి అమలు కానుంది. కస్టమర్లు గ్యాస్ డెలివరీ బాయ్స్‌కి ఏజెన్సీ నుంచి వచ్చిన ఓటీపీ చూపిస్తేనే ఎల్‌పీజీ సిలిండర్ డెలివరీ చేస్తారు. అయితే అయితే దేశవ్యాప్తంగా ఎప్పటి లోగా ఇది అమలు చేస్తారో తెలియాల్సి ఉంది. కొత్త నిబంధన ప్రకారం కస్టమర్లు ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేసిన తర్వాత ఏజెన్సీ ఆపరేటర్ రిసిప్ట్ ప్రింట్ చేయగానే కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.డెలివరీ బాయ్ ఇంటికి వచ్చిన తర్వాత అతనికి ఓటీపీ చెప్పాలి. డెలివరీ బాయ్ తన ఫోన్‌లో ఉన్న కంపెనీ యాప్‌లో ఓటీపీ ఎంటర్ చేసి సరిచూసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ చేస్తారు. ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత మొబైల్ నెంబర్లు రిజిస్టర్ చేయని గ్యాస్ కస్టమర్లు వెంటనే రిజిస్టర్ చేయాల్సి ఉటుంది. నంబర్ మారితే వెంటనే అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటీపీ రాకపోతే కస్టమర్లు ఆధార్ కార్డు చూపించి గ్యాస్ సిలిండర్ తీసుకునే అవకాశం కల్పించనున్నారు. అయితే ఓటీపీ విధానం ఇప్పటికే ఉజ్వల కస్టమర్లకు ఉంది. త్వరలో మిగతా కస్టమర్లకు సైతం అందుబాటులోకి రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa