ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరీక్ష ఫలితాలను తక్షణమే విడుదల చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 31, 2020, 08:01 PM

యూనివర్సిటీ పరిధిలో ఉన్న విద్యార్థుల డిగ్రీ రీవాల్యువేషన్, సెమిస్టర్ ఫలితాలను విడుదల చేయాలని బీసీ-ఎస్సి-ఎస్టీ మైనారిటీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రామకృష్ణ, APNF రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ యాదవ్, RPSF జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు స్థానిక యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నందు పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ NTK నాయక్ ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయో లేదో అన్నే అనుమానం ఉన్నదువల్ల తక్షణమే పరీక్షల షెడ్యూల్ విడుదల చేసి విద్యార్థులకు పరీక్షలు కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని వారు కోరారు. అదే విధంగా పెండింగులో ఉన్న పరీక్షల ఫలితాలను విడుదల చేసి విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశం కోల్పోకుండా చూడాలని వారు డీన్ ని కోరడం జరిగింది. పరీక్షల డీన్ స్పందిస్తూ 2, 3 రోజులల్లో ఫలితాలను విడుదల చేస్తామని విద్యార్థి నాయకులకు తెలపడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa