ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు చూపాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 31, 2020, 07:56 PM

ఆదోనిలో గత ప్రభుత్వ హయాంలో  జర్నలిస్టులకుపంపిణీ చేసిన పట్టాలకు స్థలాలు చూపాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో.. సోమవారం ఆర్డీవో రామకృష్ణారెడ్డికి  వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, చంద్ర మోహన్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు ఉద్యోగుల తరహాలోనే రూ.50 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కరోనా బారిన పడ్డ జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు పట్టణంలో నెలకొన్న సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళారు. ప్రైవేటు నర్సింగ్ హోంలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారితో  సమావేశమై  వైద్య సేవలు అన్ని వేళల్లో అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఈఎస్ఐ ఆస్పత్రి  సమీపంలో ఇంటి స్థలాలు కేటాయించి పట్టాలు ఇచ్చారన్నారు. ఇప్పటికి స్థలాలు చూపకపోవడంతో అయోమ‌యానికి గురవుతున్నామని ఆయన దృష్టికి తెచ్చా మ‌న్నారు. లేఅవుట్ తేస్తే సర్వే చేయించి ప్లాట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆదోని ఏరియా ఆసుపత్రిలో కరోనా సోకిన జర్నలిస్టులకు ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేయిస్తానని, క్వారంటైన్‌లో ప్రత్యేక గదులు ఉండేలా చూస్తామని ఆర్డివో ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల ఫెడరేషన్ నాయకులు ఉరుకుందప్ప, మునెప్ప, విజయ్,  సుధాకర్, నవీన్, మురళి, భరత్ రెడ్డి ఉన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa