ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో 15- 35 ఏళ్ల యువతకు ఆన్లైన్, వర్చువల్ కాన్ఫరెన్సు ద్వారా యోగా, మెడిటేషన్పై శిక్షణ తరగతులను 3 నెలలపాటు నిర్వహించనున్నట్లు సెట్కూరు సీఈవో టి.నాగరాజ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 2 నుంచి యోగా గురువుల ద్వారా సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 7.15 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగలవారు /tiny.cc/yuvayoga లో నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 08518-229146 నెంబర్ ను సంప్రదించాలన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa