ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపే స్కీమ్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 30, 2020, 12:24 PM

మహిళలకు లోన్లే కాదు.. మంచి శిక్షణ ఇచ్చి అన్ని విషయాల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. కొన్ని పథకాల ద్వారా మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా చర్యలు తీసుకుంది. మహిళలు ముందుకు వెళ్లాలంటే వాళ్లకి ఆత్మ విశ్వాసం అవసరం. దానిని గుర్తించిన ప్రభుత్వం ముఖ్యంగా వెనకబడిన వర్గాల్లో మహిళలపై ఫోకస్ చేసింది. దానికోసం నాయి రోష్ని పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు పలు విషయాల్లో శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంది.మహిళలు సాధికారత సాధించడానికి నాయి రోష్ని పథకం ఎంతో దోహదపడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేయగలిగే మహిళల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ స్కీమ్‌ ఉపయోగపడుతుంది. ప్రధానంగా మైనారిటీ మహిళలలో విశ్వాసం పెంపొందించడం, ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. 2012- 13లో ఈ పథకం ప్రారంభించబడింది. ఈ పథకం కింద వివిధ ఎన్జీవో, పౌర సంఘాలు, ప్రభుత్వ సంస్థల ద్వారా మైనారిటీ వర్గాల మహిళలకు చదువు నేర్పించడం, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ వంటి విషయాల్లో శిక్షణ అందిస్తుంది. దీని కోసం ఆయా సంస్థలకు ఆర్థిక సాయం చేస్తోంది.ఈ పథకంలో పాల్గొనే సంస్థలు, ఎన్జీవోలు విశ్వవిద్యాలయాలు, స్వయం సహాయక బృందాలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదుశిక్షణ పొందిన ప్రతి మహిళకు ఆరు రోజుల పాటు రోజుకు 100 రూపాయలు, ఐదు రోజుల పాటు ఎక్కడైనా ఉండేందుకు రోజుకు 150 రూపాయల స్టైఫండ్ అందజేస్తుంది. దీనికోసం మహిళలు నమోదు సమయంలో ఆధార్‌ కార్డ్, పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు ఐడీ కార్డ్, కిసాన్ ఫొటో పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది.ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధ, పార్శీ, జైన పలు మైనార్టీ వర్గానికి చెందిన మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల మహిళలు గ్రూప్‌లో ఉండేలా సంస్థలు ప్రయత్నించాలి. ఈ శిక్షణ కోసం మైనారిటీ మహిళలు ఆన్‌లైన్‌లోని www.minorityaffairs.gov.in‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 65 సంవత్సరాల మహిళలు దీనికి అర్హులు. అభ్యర్థి వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించి ఉండకూడదు లేకపోతే అభ్యర్థి దరఖాస్తు తిరస్కరించడం జరుగుతుంది.ఈ శిక్షణ మైనారిటీ మహిళలకు వారి హక్కుల కోసం నిలబడటానికి, ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకం కచ్చితంగా మైనారిటీ మహిళల అభివృద్ధికి ఎంతో సహాయపడుతుంది. వారు సమాజంలో గుర్తింపు, గౌరవం సాధించగలుగుతారు.ఇలాంటి పథకం ఉన్నట్టు చాలామందికి తెలియదు. ఈ విషయం షేర్ చేయడం వల్ల అలాంటి వాళ్లకు ఉపయోగపడుతుంది. వీలైనంత ఎక్కువగా ఈ విషయాన్ని షేర్ చేసి తెలియజేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa