ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల ఆరోగ్యం కోసం సంపూర్ణ పోషణ్ ప్లస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 29, 2020, 06:46 PM

మన దేశంలో ప్రతి ఏడాది పోషకాహార లోపం కారణంగా 1000 మంది తల్లులు, పసివాళ్లు చనిపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కొత్త పథకాలతో గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పిల్లలకు పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంది. అవే వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ఫ్లస్ పథకాలు. ఇందులో సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది.గర్భిణీలు, మహిళలు, పిల్లల్లో రక్తహీనత నివారించేందుకే ఈ పథకాన్ని తీసుకు వస్తున్నారు. ఈ పథకం ద్వారా ఏజెన్సీలో ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందనుంది. రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ్ ప్లస్, మిగిలిన మండలాల్లో సంపూర్ణ పోషణ్‌ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 30 లక్షల మందికిపైగా పోషకాహారం అందనుంది. 6 నుంచి 72 నెలల వయస్సు గల పిల్లలందరూ, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ద్వారా మైదాన ప్రాంతాల్లోని 47,287 అంగన్‌వాడీల పరిధిలో 26.36 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,555.56 కోట్లతో పౌష్టికాహారం పంపిణీ చేయనున్నారు.రూ.307.55 కోట్లతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ఫ్లస్ ద్వారా పౌష్టికాహారం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్న భోజనం, నెలవారి ఇంటికి పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వత్రా సిద్ధం చేసింది. ఈ స్కీమ్‌ కింద నెలకు రూ.600లతో ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు, వంద గ్రాముల బాలామృతాన్ని అందజేస్తారు. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు నెలకు 25 రోజులపాటు కోడిగుడ్డుతో పాటు అన్నం, ఆకుకూరలు, పప్పుతో భోజనం, పాయసం, లడ్డు, బిస్కెట్లు ఇస్తారు. గర్భిణులు, బాలింతలకు గుడ్డు, పాలు, ప్రోటీన్లతో కూడిన భోజనాన్ని అందిస్తారు. అంటే సజ్జలు, రాగిపిండి, జొన్నలు, అటుకులు ఎండు ఖర్జూరం వంటివి అందజేస్తారు.అంగన్‌వాడీ కార్మికులు అర్హత గల మహిళలు, పిల్లలను నమోదు చేసి డేటాను సేకరిస్తారు. సంబంధిత ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఈ పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రంలో కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ నిర్వహించబడతాయి. గర్భిణీ స్త్రీలు, రెండేళ్ల వయస్సు గల పిల్లల తల్లులలో ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పించడం జరుగుతుంది.రాష్ట్రంలో ఏఏ ఏరియాలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం అవసరమో అనే అంశంపై ఇప్పటికే సర్వే పూర్తి అయ్యింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు తేలింది. గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని గిరిజనులు, ఆదివాసీల్లో కూడా పౌష్టికాహార లోపం, రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.పేదరికంతో సరైన పోషకాహారం లభించక మన దేశంలో మహిళల్లో ప్రసవం సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన పోషకాహారం అందక ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ పథకం గురించి ప్రతి మహిళకు తెలియాల్సిన అవసరం ఉంది. అందరికీ తెలిసేలా ఈ విషయాన్ని షేర్ చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa