రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెల ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి సభ్యులు ప్రకాష్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఎంసిహెచ్ ఆసుపత్రిలో ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సూపరింటెండెంట్ మాధవి లతకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమితి సభ్యులు ప్రకాష్, ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కె అజయ్ బాబు మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం మేరకు దళారీ వ్యవస్థకు తిలోదకమిచ్చే దిశలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకు, పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి కూడా కార్పొరేషన్ పరిధిలోనే జీతాలు చెల్లించాలని, జీవో నెంబర్ 549 ప్రకారం రూ.16 వేలు వేతనం జనవరి నెల నుండి తక్షణమే ఇవ్వాలని, శానిటేషన్ పాలసీ ప్రకారం 2017 కింద పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతోపాటు సెక్యూరిటీ శానిటేషన్ పెస్ట్ కంట్రోల్ సిబ్బంది కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా కాంట్రాక్టు ఉద్యోగుల మాదిరిగా వెయిటేజ్ ఇచ్చి కమిటీ ద్వారా రెగ్యులర్ చేయటానికి ప్రభుత్వం జీవో నెంబర్ 301 విడుదల చేయడం పట్ల ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు నాగరాజ్, పారిశుద్ధ్య కార్మికులు సోమన్న, ఆనంద్, చిట్టెమ్మ, ఆనందమ్మ పాల్గొన్నారు
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa