ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరవ రోజూ ఎమ్మార్పిఎస్‌ నిరాహార దీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 29, 2020, 06:15 PM

ఎమ్మార్పిఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు 24 నుండి 29 వరకు ఎమ్మార్పిఎస్ దీక్ష‌లో భాగంగా  ఆదోని టౌన్‌ అధ్యక్షులు ఎం జగన్ ఆధ్వర్యంలో శ‌నివారం త‌హ‌శీల్దార్‌ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేప‌ట్టారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ నెట్టికంఠ‌య్య మాట్లాడుతూ దళిత జీవన ఆధారమైన అసైన్డ్ భూములను వారికి పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. ఆనాటి నుండి ఈనాటి వరకు పరిపాలన చేసిన పాలకులు ప్రధాని నుండి ముఖ్యమంత్రి వరకు పరిపాలన చేసిన వారు అనేక సందర్భాలలో దళిత గిరిజన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం భూములు పంపిణీ చేశారన్నారు. ఆ భూములు సాగు చేసుకుంటూ దళితులు జీవనం సాగించేవారన్నారు. ఇప్పుడు ప్ర‌భుత్వం పేద‌ల‌కు ఇంటి ప‌ట్టాల పంపిణీలో ఆ భూములను కోల్పోతున్నారన్నారు. వారికి జీవన ఆధారమైన భూములు లేకపోవడం  బాధాకరమ‌న్నారు.  దళితులు ఎవరైతే ప్రభుత్వ భూములను సాగు  చేస్తున్నారో వారికి  పట్టాలు పంపిణీ చెయ్యాలన్నారు. ఎస్సీ ఎస్టీ భూములను కాపాడుకోవ‌డానికి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం  చేస్తామన్నారు. అనంత‌రం ఎఓకు వినతి పత్రం అంద‌జేశారు.  మహిళా అధ్యక్షురాలు కె సుదర్శన్నమ్మ నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ దీక్ష ప్రారంభించారు. ఈ నిరాహార దీక్షలో ఎమ్మార్పీఎస్ టౌన్ లీడర్ వి మణికంఠ, కె. మహేష్, ఎం విజయ రాజు, జి సురేష్, ఎం ఈరన్న, ఎం చిన్న నరసింహులు, హెచ్‌ లక్ష్మన్న, కె ప్రభుదాస్, పరుశురాం, ఎంఎస్ ఎఫ్ నరసింహ, సల్మాన్ రాజ్, మాదిరి తిమ్మప్ప పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa