గుమ్మనూరు పేకాట స్థావరంపై జరిగిన దాడిలో మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడటం చూస్తుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లుగా ఉందని టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలోని పేకాట క్లబ్బులో మంత్రి హస్తం ఉందనే విషయం జగమెరిగిన సత్యమని, పేకాట నిర్వహణలో ప్రతి రోజూ వారి కుటుంబ సభ్యులకు వాటాలు అందుతున్నాయని ఆరోపించారు.దాడి జరిగిన రోజు మంత్రి సోదరుడు గుమ్మునురు గ్రామం నుండి తప్పించుకొని హాలహర్వి మీదుగా ఆలూరుకు వచ్చిన మాట వాస్తవం కాదా అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీతివంతమైన పాలన అందిస్తామని గొప్పలు చెప్తుండగా ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రి మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు అండదండలు అందించడం బట్టి చూస్తుంటే నేతిబీరకాయలో నీతి చందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే గుమ్మనూరు జయరాము మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa