ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా కుటుంబ సభ్యులకు సంబంధం లేదు : మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 28, 2020, 09:53 PM

తన స్వగ్రామం గుమ్ములూరులో నిర్వహిస్తున్న పేకాట వ్యవహారంపై తనతోపాటు కుటుంబ సభ్యులకు ఎవరికి సంబంధం లేదని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్ప‌ష్టం చేశారు. శుక్రవారం తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల సమయం నుంచి తాను, తమ్ముళ్లు కుటుంబ సభ్యులు ఆలూరులోనే నివాసముంటున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీతివంతమైన పాలన అందిస్తున్నార‌న్నారు. ఆయన అడుగు జాడల్లో తాము నడుస్తున్నామన్నారు. గ్రామంలో  పేకాట స్థావరాలపై జరపడంపై ఆయ‌న పోలీసులను అభినందించారు. ఈ వ్య‌వ‌హారంలో ఎంతటి వారు ఉన్న వ‌దిలి పెట్టరాదని పోలీసులను కోరుతున్నానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa