ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థి సత్యాగ్రహం పేరుతో దీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 28, 2020, 09:52 PM

జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ అలాగే మిగతా అన్ని పరిక్షలను రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉదయం 11 గంటల నుండి కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో " *విద్యార్థి సత్యాగ్రహం* " అను పేరుతో దీక్ష చేయడం జరుగుతుంది. *రాష్ట్ర అధ్యక్షులు నాగ మధు యాదవ్ గారు* మాట్లాడుతూ Covid-19 విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒకసారి విద్యార్థుల పై దృష్టి పెట్టి వారి పరీక్షలు రద్దు చేసి ప్రాణాలు కాపాడాలని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా తో పాటు ప్రైవేట్ యూనివర్శిటీలలోని అన్ని కోర్సులోని అన్ని పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో NSUI విద్యార్థి విభాగం పిటిషన్ కూడా వేయడమయినదని కోర్టులో పెండింగ్ లో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పరీక్షలు నిర్వహించుటకు సన్నద్ధమవుతుందని ఇలాగే విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యార్థి సత్యాగ్రహం నిర్వహించడమైనదని నాగమధు యాదవ్ గారు డిమాండ్ చేశారు . అదేవిధంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నందువలన JEE.NEET పరీక్షలు నిర్వహించడo ఏ మాత్రం సరికాదని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్ ఎస్ యు ఐ హెచ్చరిస్తోందని నాగమధు యాదవ్ గారు తెలియజేశారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు కర్నూలు అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ జాన్ విల్సన్ గారు వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ దీక్షలో NSUI రాష్ట్ర అధ్యక్షులు నాగ మధు యాదవ్ రాష్ట్ర కార్యదర్శి ధోని రాజు యాదవ్.జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ .ఉపాధ్యక్షుడు వీరేష్ యాదవ్ .జిల్లా కార్యదర్శి మహేష్ స్వామి గారు .నవీన్ కుమార్.మొదలగువారు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa