వైకాపా ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పూర్తయిన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన ప్రచార పుస్తకాలను ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి కసరత్తు చేస్తున్నారని తెలిపారు. మొత్తం 129 హామీల్లో 78 హామీలను అమలు చేసినట్లు చెప్పారు.ఇప్పటి వరకు ఇవ్వని హామీలు సైతం 40 వరకు పూర్తి చేసినట్లు వివరించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్కెల్యే అన్నారు. దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని, ఇతర రాష్ట్రాలు సైతం వీటిని ఆదర్శంగా తీసుకుంటున్నాయని వివరించారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ సుబ్బారావు, ట్రాఫిక్ సీఐ లక్ష్మయ్య, మెప్మా టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ చిన్నబాబయ్య, మెప్మా మేనేజర్ వీరారెడ్డి, వైకాపా పట్టణ కన్వీనర్ చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa