కరోనా పేరెత్తితో చాలు అంతా భయంతో వణికిపోతున్నారు. కరోనా ఎటు వైపు నుంచి సోకుతుందోనని తెలియక భయంతో బతుకుతున్నారు. అయితే రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే కరోనాను అధిగమించ వచ్చునని ప్రచారం జరుగుతుంది. దాంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు వ్యాపారస్తులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కరోనా టీ పేరుతో మంచి వ్యాపారం చేసుకుంటుండగా తాజాగా ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీ మార్కెట్లోకి వచ్చేసింది. ఈ ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీలో రోగ నిరోధక శక్తి ఉంటుందని వ్యాపారస్తులు చెప్తుండటంతో ప్రజలు ఎగబడి మరీ తింటున్నారు.ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందంటే కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఉంది. ఐస్ లాండ్ హోటల్ నిర్వాహకుడు రోగనిరోధక శక్తిని పెంచే చికెన్ ధమ్ బిర్యానీ అంటూ వెరైటీ ఆలోచనకు శ్రీకారం చుట్టాడు.ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు హోటల్స్ లో తినాలంటేనే భయపడుతున్నారు. హోటల్ రంగం పూర్తిగా సగానికి సగం పడిపోయింది.ఈ సమయంలో ప్రజలను ఆకర్షించే విధంగా ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీ తయారు చేస్తున్నాడు. ఈ బిర్యానీని తినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.కొందరైతే పార్శిల్ తీసుకుని వెళ్తున్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఉండేలా బిర్యానీని తయారు చేస్తున్నామని చెప్పడంతో చుట్టు ప్రక్క గ్రామాల వారు పట్టణానికి వచ్చి ఈ బిర్యానీ ఆరగిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం అంటు హోటల్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ బిర్యానీలో దాల్చిన చెక్క, సొంఠి, మిరియాలు, లవంగాలు, ఉసిరి, తులసి పౌడర్ వివిధ రకాల మూలికలతో బిర్యానీ తయారు చేస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. మెుత్తానికి నోరూరించే ఈ ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీ రేటు కేవలం రూ.140 మాత్రమేనని చెప్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa